హుజూరాబాద్, మే 18: భూకబ్జా ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని టీఆర్ఎస్వీ కరీంనగర్ జిల్లా మాజీ ఇంచార్జి మెలుగు పూర్ణచందర్.. మాజీ మంత్రి ఈటల రాజేందర్కు సవాల్ విసిరారు. మంగళవారం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. నిజంగా ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోతే ఈటల రాజేందర్ బహిరంగ చర్చకు రావాలని, తాము కూడా తగిన సాక్ష్యాలతో రుజువు చేస్తామని తెలిపారు.