హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): బడుగువర్గాలకు టీఆర్ఎస్ సర్కార్ గొడుగుపట్టింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితేనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని భావించిన ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ, ఉచిత చేపపిల్లల పంపిణీని చేపట్టింది. బీసీలు సమున్నతంగా బతికేందుకు హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్, కోకాపేటల్లో వంద కోట్లతో ఆత్మగౌరవ భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. అసెంబ్లీలో సంక్షేమ రంగంపై చర్చలో స్వరాష్ట్రంలో బీసీ కులాల అభ్యున్నతికి సర్కార్ చేపట్టిన కార్యక్రమాలను వెల్లడించింది.