కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ఓటేసి ఆదరించారు
గ్రేటర్లో మంచి మెజార్టీ ఇచ్చినందుకు ధన్యవాదాలు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హన్మకొండ, మే 3 : టీఆర్ఎస్ వెంటే ఓరుగల్లు ప్రజలు ఉన్నారని, ఇందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అత్యధిక స్థానాలు కట్టబెట్టిన తీరే నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఎన్నికల ఫలితాలు వెల్లడైన సందర్భంగా హన్మ కొండ హరిత హోటల్లో మంత్రి సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. గ్రేటర్పై మరోసారి గులా బీ జెండా ఎగురవేసేలా మంచి స్థానాలు ఇచ్చిన వరంగల్ ప్రజ లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు. కరోనా క్లిష్ట పరిస్థి తుల్లో కూడా ప్రజలు వచ్చి ఓటువేసి టీఆర్ఎస్కు పట్టం కట్టార ని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర జాప్రతినిధుల పనితీరుపై నమ్మకంతో మరోసారి టీఆర్ఎస్ పా ర్టీని ఆశీర్వదించారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. టీఆర్ఎస్తోనే నగర అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతోనే పట్టం కట్టారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న ఆరు నెలల కాలంలో వరంగల్ రూపురేఖలు మార్చు తామని స్పష్టం చేశా రు. అబద్ధాలు, గాలి మాటలు మాట్లాడిన బీజేపీకి, మోసపూరిత మాటలతో మభ్యపెట్టిన కాంగ్రెస్కు ప్రజ లు తగిన బుద్ధి చెప్పార న్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి పేర్కొన్నా రు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగిరిందన్నారు. మెజార్టీ స్థానాలను గెలిపించిన వరంగల్ నగర ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. అయితే ఈ గెలుపు తమపై మరింత బాధ్యతను పెంచిందని మంత్రి పేర్కొన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన నాయ కులు, కార్యకర్తలు, ప్రజలందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వాన్ని మరోసారి వరం గల్ ప్రజలు బలపరుస్తూ టీఆర్ఎస్కు పట్టం కట్టారన్నారు. పార్టీపై వరంగల్ ప్రజలకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉండడం తోనే మెజార్టీ స్థానాలు గెలిపించారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అందుకు వరంగల్ ప్రజలకు కృతజ్ఞత లు తెలిపారు. గ్రేటర్ వరంగల్లోని విలీన గ్రామాలను అభివృ ద్ధి పథంలోకి తీసుకొచ్చి పట్టణ వాతావరణం కల్పించేం దుకు కృషి చేస్తానన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడు తూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఒక టీం వర్క్గా పనిచేశా మని అన్నారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో పరకాల నియో జకవర్గంలో మూడు డివిజన్లు ఉండగా అన్ని చోట్లా టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే గెలిచారన్నారు. ఇందుకు సహకరించి న ఆయా డివిజన్ల ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో రాజ్యసభ సభ్యు డు బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, భూపాలపల్లి, నర్సంపేట ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శ న్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్ ఉమ్మ డి జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, జీహెచ్ఎంసీ మాజీ మే యర్ బొంతు రామ్మోహన్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు రుణ వి మోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.