ఎల్బీనగర్, మే 20 : కారణం లేకుండా బయటకు వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ హెచ్చరించారు. గురువారం లాక్డౌన్ సమయంలో ఇన్నర్ రింగ్రోడ్డులో నాగోలు బ్రిడ్జి వద్ద ప్రయాణిస్తున్న వాహనాలను సీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం పరిశ్రమల నుంచి ఇంటికి వెళ్లే వారు లాక్డౌన్ సడలింపు సమయంలోనే తిరిగి నివాసాలకు వెళ్లాలని, అందుకు అనుగుణంగా యాజమాన్యాలు తమ సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించని వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 21 వేల కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. సీపీ వెంట ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, సీఐ అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు.
శేరిలింగంపల్లి, మే 20: లాక్డౌన్ నేపథ్యంలో శేరిలింగంపల్లిలోని పలు ప్రాంతాల్లో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ గురువారం పర్యటించారు. నలగండ్ల కూరగాయల మార్కెట్, తారానగర్ మార్కెట్, రాజీవ్ గృహకల్ప ప్రాంతాలను స్థానిక పోలీసు అధికారులతో కలిసి పర్యవేక్షించారు. నిబంధనలకు విరుద్ధంగా రహదారులపై వచ్చిన వాహనదారులతో మాట్లాడారు. అనవసరంగా ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.