సంగారెడ్డి : నిన్న బీజేపీలో చేరిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు.. తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు.. దివిటి కనకయ్య(7వ వార్డు), డీ బాలకృష్ణ(8వ వార్డు) నిన్న బీజేపీలో చేరారు. వీరిద్దరూ మళ్లీ ఇవాళ తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో కనకయ్య, బాలకృష్ణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిద్దరికి మంత్రి హరీష్ రావు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధికి పాటుపడుతున్న టీఆర్ఎస్ పార్టీలోనే తాము ఉంటామని కౌన్సిలర్లు స్పష్టం చేశారు.