హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కొవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశమైంది. ఔషధాలు, ఆక్సిజన్, టీకాల సమీకరణ, సరఫరాపై సమీక్షిస్తున్నారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి, కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్రెడ్డి హాజరయ్యారు.