హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): జాతిపిత మ హాత్మాగాంధీ చూపిన మార్గం అనుసరణీయమని ప్రముఖులు పేర్కొన్నారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు హైదరాబాద్ లంగర్హౌస్లోని బాపు సమాధి వద్ద నివాళులర్పించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. తమిళిసై, దత్తాత్రేయకు మంత్రి కేటీఆర్ సాదరంగా స్వాగతం పలికారు. మరోవైపు, అసెంబ్లీ ప్రాంగణంలోని జాతిపిత విగ్రహానికి మండలి చైర్మన్ ప్రొటెం వెన్నవరం భూపాల్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభసభ్యుడు సంతోష్కుమార్, ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత తదితరులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రు లు మహమూద్అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీలు కేశవరావు, రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, నవీన్కుమార్, దయానంద్, ప్రభాకర్రావు, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ముఠాగోపాల్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయ ర్ శ్రీలత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, జీఏడీ సెక్రటరీ (పొలిటికల్) వికాస్రాజు, పర్యాటకశాఖ సెక్రటరీ శ్రీనివాసరా జు, డీజీపీ మహేందర్రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ వీ నర్సింహాచార్యులు, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని, ఇందుకు తెలంగాణ బిడ్డగా గర్వపడుతున్నానని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మీడియాతో పేర్కొన్నారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వులే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనా దక్షత దేశానికే ఆదర్శమని ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరా జ్యం ఫలాలు తెలంగాణలోనే దక్కుతున్నాయని మంత్రి ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.
ఇతరులకు సేవ చేయడంలోనే మీరేమిటో తెలుస్తుందని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ‘మీరేంటో మీరు తెలుసుకోడానికి ఉత్తమ మార్గం ఇతరుల సేవలో నిమగ్నమవ్వడమే. మహాత్మాగాంధీ జీవితమే ఇందుకు ఉదాహరణ. గాంధీ జయంతి 2021’ అని హ్యాష్ట్యాగ్ చేస్తూ శనివారం ట్వీట్ చేశారు.