హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): చాక్లెట్ డబ్బాలో అనుమానం రాకుండా బంగారం అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం రియాద్ నుంచి కువైట్ మీదుగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీ అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో చాక్లెట్ డబ్బాల మాటున దాచి ఉంచిన రూ.34.24 లక్షల విలువైన 763.66 గ్రాముల బంగారం పట్టుబడింది. నిందితుడి అదుపులోకి తీసుకున్న అధికారులు.. అతడిపై కేసు నమోదు చేశారు.