మేయర్ వై సునీల్రావు
36వ డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభం
కార్పొరేషన్, జూన్ 1: నగరంలో అభివృద్ధి పనులు చేపట్టి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. స్థానిక 36వ డివిజన్లో మంగళవారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజలకు పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. డ్రైనేజీ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. మంకమ్మతోటలో గతంలో నిర్మించిన డ్రైనేజీలు శిథిలావస్థకు చేరి మురుగు నీరు ప్రవహించేందుకు అవరోధం కలుగుతోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కొత్తవి నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. డివిజన్లో తాగునీటి సరఫరాలో ప్రెషర్ లేని ప్రాంతాల్లో కొత్త పైపులైన్లు వేస్తున్నట్లు తెలిపారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే స్థానిక కార్పొరేటర్ సూచనలను పరిగణనలోకి తీసుకొని దశల వారీగా పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. వానకాలంలో వరద నీటితో ఇబ్బందులు లేకుండా మురుగు కాలువలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.