హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పూర్తిచేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తమకు హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్సీలు, పీఆర్టీయూ నేతలు వెల్లడించారు. రెండుమూడు రోజుల్లో అంతర్ జిల్లా, స్పౌజ్, పరస్పర బదిలీల షెడ్యూల్ను విడుదలచేస్తామని చెప్పారని వివరించారు. సోమవారం గన్ఫౌండ్రీలోని మంత్రి కార్యాలయంలో ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు పలు విద్యారంగ సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి:టీఎస్యూటీఎఫ్
కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టినందున తక్షణమే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేయాలని టీఎస్యూటీఎఫ్ కోరింది. సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని సోమవారం వర్చువల్గా నిర్వహించారు. కొవిడ్తో ఉపాధ్యాయుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన సంఘం, పాఠశాలల ప్రారంభానికి ముందే వ్యాక్సినేషన్ను పూర్తిచేయాలని కోరింది. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి తదితరులు పాల్గొన్నారు.