హైదరాబాద్, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా షీటీమ్స్ సిబ్బంది క్యూఆర్ కోడ్ ద్వారా కూడా బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణపై నిర్వహిస్తున్న మూడ్రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం రెండోరోజు కొనసాగింది. క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి, ఐపీసీ సెక్షన్ల కింద ఎలా కేసులు నమోదుచేయాలి. షీటీం సాఫ్ట్వేర్ను ఎలా వినియోగించుకోవాలన్న అంశాలపై 308 మంది సిబ్బందికి రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కార్యక్రమాల్లో అడిషనల్ డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.