వరంగల్ అర్బన్ : అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న లారీని, మోటార్సైకిల్ను సీజ్ చేయడంతో పాటు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించేందుకు యత్నించారు. నిందితుడిని హసన్పర్తికి చెందిన మోతం అనిల్గా గుర్తించారు. భీమదేవరపల్లి మండలానికి చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. టాస్క్ఫోర్స్ ఇన్స్ప్టెక్లర్లు నందిరామ్ నాయక్, జి. మధు బియ్యాన్ని, వాహనాల్ని కేయూసీ పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ.4.60 లక్షలుగా సమాచారం.