చినజీయర్ స్వామి
వనపర్తి టౌన్, మార్చి 16: ప్రతి ఒక్కరి ఆలోచనలు ఉన్నతంగా ఉండాలని చినజీయర్స్వామి సూచించారు. మంగళవారం వనపర్తిలోని వేంకటేశ్వర స్వామి ఆలయ 45వ బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెల్లవారుజామునే ఆలయంలో నిర్వహించిన పూజలు, హోమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రాజనగరం రోడ్డులో ఉన్న విశ్వకేశన గోశాలలో 160 గోమాతల మధ్య చినజీయర్స్వామి సప్త గోవుల కుటీరానికి భూమి పూజ చేశారు. సాయంత్రం వేంకటేశ్వరాలయంలో వెంకన్న, అలివేలుమంగ కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. ఏ పనైనా నమ్మకంతో చేస్తే విజయం దానంతట అది వరిస్తుందన్నారు. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేలా చూడాలన్నారు.