దామరచర్ల, మే 4 : కరోనా కట్టడిలో భాగంగా దామరచర్లలో మంగళవారం నుంచి ఈ నెల 15 వరకు స్వచ్ఛంద లాక్డౌన్ పాటించాలని గ్రామపంచాయతీ తీర్మానించింది. అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు మాత్రమే తెరువాలని, ఆ తరువాత మూసి వేయాలని కోరింది. ఈ మేరకు గ్రామంలో టాంటాం వేయించారు. గ్రా మంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, లేని పక్షంలో జరిమానా విధిస్తామని ప్రకటించారు. స్వచ్ఛంద లాక్డౌన్ కారణంగా మధ్యాహ్నం 2 గంటల తరువాత మండల కేంద్రంలోని దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వైన్స్ మూసివేశారు. మెడికల్ షాఫులు, కూరగాయలు, మిల్క్సెంటర్లకు మినహాయింపు ఇచ్చారు.
అడవిదేవులపల్లిలో 20 వరకు..
అడవిదేవులపల్లి: కరోనా కట్టడికి మండల కేం ద్రంలో స్వచ్ఛంద లాక్డౌన్ పాటించాలని తీర్మానించారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారు, వివిధ పార్టీల నాయకులు సమావేశమయ్యారు. బుధవారం నుంచి ఈ నెల 20 వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణాలు తెరచి ఉంచాలని, ఆ తర్వాత మూసి వేయాలని తీర్మానించారు. ప్రజలు మాస్కులు లేకుండా బయటికి రావద్దని, దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి ఉపేందర్ మాట్లాడుతూ మండల ప్రజలు కరోనా కట్టడికి సహకరించలని సూచించారు. కరోనా టీకా కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుర్రా సేవ్యా, ఎంపీడీఓ ఎండీ మసూద్ షరీఫ్, తాసీల్దార్ రఘు, ఎస్ఐ వీర శేఖర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోలు నాగార్జున, సర్పంచులు కొత్తా మర్రెడ్డి, కుర్రా బీమా, పకీరా పాల్గొన్నారు.