ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య
తంగళ్లపల్లిలో రైతువేదిక పరిశీలన
ఈనెల 11న ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
సిరిసిల్ల రూరల్, జూన్ 8: రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని జిల్లా రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో రాష్ట్రంలోనే మొట్టమొదటగా పూర్తయిన రైతు వేదికను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 11న మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డితో రైతువేదికను ప్రారంభించనున్నట్లు చెప్పారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా తంగళ్లపల్లిలోనే రైతువేదిక పూర్తయిందని చెప్పారు. రైతుల ఆత్మగౌరవ ప్రతీకలుగా రైతువేదికలు నిలుస్తాయని, రైతులకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. అంతకుముందు ఎంపీపీ పడిగెల మానస మాట్లాడుతూ, ఈనెల 11వ తేదీన మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి రైతు వేదికను ప్రారంభిస్తారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సిరిసిల్ల విండో చైర్మన్ బండి దేవదాస్గౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కొమ్మేటి రాజిరెడ్డి, ఆర్బీఎస్ క్లస్టర్ అధ్యక్షుడు దొర్నాల జయరాంరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ అంకారపు రవీందర్, పడిగెల రాజు, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెద్దూరి తిరుపతి, నులుగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.