ప్రధాని పర్యటన.. రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాజీవ్ రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని చేరుకుంటారు. అటునుంచి శామీర్పేట మండలం తుర్కపల్లిలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉత్పత్తి యూనిట్కు వెళ్తారు. ఈ నేపథ్యంలో ప్రధాని కాన్వాయ్ వెళ్లే సమయంలో భద్రత దృష్ట్యా రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో హైదరాబాద్-కరీంనగర్ మార్గంలో వాహనదారులు సహకరించాలని కోరారు.
గుజరాత్లోని బైడస్ క్యాడిలా సంస్థను ప్రధాని సందర్శించారు. క్యాడిలా సంస్థ తయారు చేస్తున్న ‘జైకోవ్-డీ’ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధిన ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రస్తుతం రెండో దశ ప్రయోగాల్లో ఉన్న జైకోవ్-డీ వ్యాక్సిన్ ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహారాష్ట్రలోని పుణెలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. అటునుంచి హైదరాబాద్కు పయణమవుతారు.
తాజావార్తలు
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు
- ‘లైంగిక దాడి బాధితులకు కోర్టు బాసట’
- చరిత్రలో ఈరోజు.. సాయుధ పోరాటంతోనే స్వారాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు
- రిపబ్లిక్ డే గిఫ్ట్గా అక్షయ్ 'బచ్చన్ పాండే'
- వ్యవసాయానికి ఏటా రూ.35 వేల కోట్లు: మంత్రి హరీశ్
- కావలిలో కారును ఢీకొట్టిన టిప్పర్.. వేములవాడ వాసి మృతి
- ఆశయాలను కాలరాసి విగ్రహారాధన చేస్తే సరిపోతుందా..?: మమతాబెనర్జి
- ప్రభాస్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
- రికార్డ్.. ఒకే రోజు 3 లక్షల మందికి టీకా
- అదనంగా 2లక్షల వ్యాక్సిన్ డోసులు ఇవ్వండి : కేంద్రానికి ఉత్తరాఖండ్ వినతి