ఎంపీ బడుగుల లింగయ్య
సూర్యాపేట టౌన్, మే 22 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 సబ్ సెంటర్లకు మెడికల్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో హెల్త్ సబ్ సెంటర్లకు మెడికల్ కిట్లను శనివారం తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్పహాడ్ మండలం భక్తళాపురం, నకిరేకల్ నియోజకవర్గంలోని భీమారం సబ్ సెంటర్లకు మెడికల్ కిట్లను అందజేసినట్లు చెప్పారు. ప్రతి సెంటర్కు లక్ష రూపాయల విలువైన బెడ్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్, స్లైన్ సెట్, స్ట్రెచర్, స్టాండ్ అందజేస్తున్నామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని సబ్ సెంటర్ల వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, సర్పంచ్ బడుగుల శ్రీను, నాయకులు సురేందర్రెడ్డి, పాండు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.