హైదరాబాద్: హోలీ పండుగ సందర్భంగా సిక్కులు ర్యాలీ నిర్వంచనున్నారు. హైదరాబాద్లోని గౌలిగూడ గురుద్వార్ నుంచి కిషన్బాగ్ గురుద్వార్ వరకు సిక్కు మతస్థులు ర్యాలీ చేపట్టనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీ నిర్వహిస్తున్నారని, ఈ నేపథ్యంలో ర్యాలీ జరిగే రూట్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ ర్యాలీ గౌలిగూడ, శంకర్ షేర్ హోటల్, మహబూబ్గంజ్, ఎస్ ఏ బజార్ మాస్క్, బేగంబజార్ ఛత్రి, జుమ్మేరాత్ బజార్, పురానాపూల్, బహుదూర్పురా పీఎస్, బహుదూర్పురా ఎక్స్రోడ్స్, కిషన్బాగ్ వరకు వెళ్తుందని తెలిపారు. ఆంక్షల నేపథ్యంలో ఆయా రూట్లలో వెళ్లే వారు నిర్ణీత సమయంలో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
ప్రపంచ వాణిజ్యానికి ట్రాఫిక్ జామ్
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్