హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండు రోజులపాటు హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. దీంతో నేడు, రేపు నగరంలోని వివిధ మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు, ఉపరాష్ట్రపతి నివాసం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్ బేగంపేట వరకు ఆంక్షలు ఉంటాయి. ఆ తర్వాత 12 గంటలకు తిరుగు ప్రయాణం కారణంగా ఉపరాష్ట్రపతి ప్రయాణించే మార్గాన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.