హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుండపోతగా కురిసిన వానకు హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్వద్ద ఉన్న చింతలచెరువు నిండి అలుగు పారుతున్నది. దీంతో ఇనాంగూడ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద ప్రవహిస్తున్నది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటి వల్ల వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.