హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): పర్యాటకరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పంథాలో ముందుకు సాగుతున్నది. హైదరాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలతో పర్యాటకులను ఆకర్షించేందుకు వారి కాలనీలు, అపార్ట్మెం ట్ల వద్దకే టూరిజం బస్సులను పంపేలా తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) ఆధ్వర్యం లో చర్యలు చేపడుతున్నది. పదిమంది కలిసి టూర్కు వెళ్లాలన్నా మి నీ వాహనాన్ని పంపిస్తున్నది. దూరాన్ని బట్టి ఈ ప్యాకేజీలు ఒక్కో వ్యక్తికి రూ.450 నుంచి రూ.9,900 వరకు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ, రామోజీ ఫిల్మ్సిటీ టూర్ ప్యాకేజీ ధరను రూ.1,850 గా నిర్ణయించింది. శ్రీశైలం (రూ.2,250), నాగార్జునసాగర్ (రూ.750), భద్రాచలం, పాపికొండలు (రూ.4,599), కాళేశ్వరం, వేములవాడ (రూ.3,999), యాదగిరిగుట్ట, కొలనుపాక, కొమురవెల్లి (రూ.1,499), రామప్ప, ఖిలావరంగల్ (రూ.3,649), శ్రీశైలం బ్యాక్వాటర్లో సోమశిల, నాగార్జునసాగర్ బోటింగ్ (రూ.3,999)తోపాటు ఇతర రాష్ర్టాల్లోని షిరిడీ, గోవా, మైసూర్, తిరుపతి, కాణిపాకం ప్రాంతాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీలతో టూర్లను ఆఫర్ చేస్తున్నది. ఆన్రోడ్లో షిరిడీ టూర్కు రూ.9,900తో ప్యాకేజీని తీసుకొచ్చిన టీఎస్టీడీసీ.. రూ.14,999తో తిరుపతికి ఫ్లైట్ టూర్ను కూడా ఆఫర్ చేస్తున్నది.
తెలంగాణలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనలతో ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేస్తున్నాం. ఇప్పటివరకు హైదరాబాద్లో హుస్సేన్సాగర్, దుర్గం చెరువులకు మాత్రమే పరిమితమైన క్రూజ్బోట్లను శ్రీశైలం బ్యాక్వాటర్లోనూ ప్రవేశపెడుతున్నాం. ఇది ఎంతో ఆకర్షణీయమైన ప్యాకేజీ. అంతేకాకుండా పర్యాటకులకు అనువుగా ఉండేలా ‘ఇంటి వద్దకే టూరిజం బస్సు’ కాన్సెప్ట్ను తీసుకొచ్చాం.