వికారాబాద్ : వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిలతో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి సబితారెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు కలిసి మొక్కను అందజేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి.
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి
వెలుగులోకి మరో పోర్న్ రాకెట్ ..కటకటాల వెనక్కి వర్ధమాన నటి
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత