హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్ర ఖ్యాత ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు ఇంజినీరింగ్ డే నిర్వహించనున్నారు. ఎర్రమంజిల్లోని జలసౌధలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్, ఇంజినీర్స్ జేఏసీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, ఇంజినీర్స్ ఫెడరేషన్, సింగరేణి రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగనున్నది. అనంతరం జరిగే వర్చువల్ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్, విశ్రాంత చీఫ్ ఇంజినీర్ జనార్దన్ ప్రసంగించనున్నారు. సాగునీటి పారుదలశాఖ విశ్రాంత కమిషనర్ సాన మారుతి, టీఎస్ ట్రాన్స్కో డైరెక్టర్ (లిఫ్ట్స్) సూర్యప్రకాశ్, ఎస్సీసీఎల్ మాజీ డైరెక్టర్ వాసుదేవ్రావులకు జీవిత సాఫల్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.