పాట్నా: తన తండ్రి ఏర్పాటు చేసిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఇలా విచ్ఛిన్నం కావడాన్ని తాను చూడలేనని బీహార్కు చెందిన ఆ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ గురువారం ఏఎన్ఐతో అన్నారు. పార్టీని రక్షించుకునేందుకు అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. సుదీర్ఘ పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. తాను సింహం కొడుకునని, ఇలాంటి వాటికి భయపడబోనని వ్యాఖ్యానించారు.
ఎల్జేపీకి తానే అధ్యక్షుడినని చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. తన నాయకత్వంపై విశ్వాసం ఉంచిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుల అఫిడవిట్లు తన దగ్గర ఉన్నాయన్నారు. 75 మంది సభ్యులను కలిగిన పార్టీ జాతీయ కార్యనిర్వాహక సంస్థ ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటుందని తెలిపారు. ఇటీవల జరిగిన జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో 9 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారయ్యారని చెప్పారు. సస్పెండైన సభ్యులు తన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ఇది చట్టవిరుద్ధమని ఆరోపించారు.
సస్పెండైన 5 మంది ఎంపీలు ఇకపై ఎల్జేపీ ఎంపీలు కాదని, స్వతంత్ర ఎంపీలని చిరాగ్ తెలిపారు. ఈసీకి, లోక్సభ స్పీకర్కు దీనిపై సమాచారం ఇచ్చానని, ఎల్జేపీ రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసీ, లోక్సభ స్పీకర్ తగిన నిర్ణయం తీసుకుంటారని తాను నమ్ముతున్నానని అన్నారు.