వీపనగండ్ల, ఏప్రిల్ 27 : మండలంలోని కల్వరాల, తూంకుంట, బొల్లారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టించి పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారానే అమ్ముకోవాలని సూచించారు. తేమ శాతం దృష్టిలో ఉంచుకొని ధాన్యాన్ని ఆరబెట్టి సహకరించాలని రైతులకు సూచించారు. అదేవిధంగా మండలంలోని మొత్తం 11 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, సర్పంచులు విజయ్, రఘునాథ్ రెడ్డి, పధ్మ ఎంపీటీసీలు భాస్కర్ రెడ్డి, రాముడు, కవిత సింగిల్విండో డైరెక్టర్లు రాజు, సూర్యనారాయణ టీఆర్ఎస్ నాయకులు మల్లయ్య, వెంకటేశ్, కురుమయ్య, రాకేష్, లోకారెడ్డి, బాలకృష్ణ పాల్గొన్నారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
పెద్దమందడి, ఏప్రిల్ 27 : గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మనిగిల్ల, జగత్పల్లి గ్రామాల్లో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏవో మల్లయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో విండో ఉపాధ్యక్షుడు కుమార్యాదవ్, జగత్పల్లి సర్పంచ్ అనంత, ఎంపీటీసీ కుర్మయ్య, డైరెక్టర్లు, సీఈవోలు జగదీశ్వర్రెడ్డి, సుధాకర్, రైతులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పాన్గల్, ఏప్రిల్ 27 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డీసీసీబీ డైరెక్టర్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీపీ శ్రీధర్రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మి అన్నారు. మంగళవారం మండలకేంద్రంతోపాటు అన్నారం, రేమద్దుల, మల్లాయిపల్లి, శాగాపూర్ గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రైతు లు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్నాయక్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వెంకటయ్యనాయుడు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాముయాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రఘుపతినాయుడు, యూత్ మండల అధ్యక్షుడు సాయికుమార్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రామ్మూర్తి నాయుడు, సర్పంచులు మేస్త్రీరాములు, నాగేశ్వర్, ఆంజనేయులు, విష్ణు, ఉపసర్పంచు ప్రవీణ్కుమార్రెడ్డి, విండో సీఈవో భాస్కర్గౌడ్, ఐకేపీ మండల కోఆర్డినేటర్ మద్దిలేటి, కండక్టర్ శ్రీనివాసులు, వీఆర్ఏ సురేశ్, మహిళా సమాఖ్య సిబ్బంది స్వామి, నాగరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.