హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకంతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ దుకాణాలు బంద్ అవుతాయని.. ఆయా పార్టీల కార్యాలయాలకు ఇక టులెట్ బోర్డులు పెట్టుకోవాల్సిందేనని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ఎద్దే వా చేశారు. కేసీఆర్ ప్రజలందరి బంధువు అవుతున్నారని ఆ పార్టీల నేతలకు కండ్లమంటగా ఉన్నదని చెప్పారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ఓ బ్రోక ర్, బండి సంజయ్ ఓ జోకర్, అర్వింద్ ఓ లోఫర్ అని మండిపడ్డారు. ఆ ముగ్గురు సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దళితబంధు పథకంపై మాట్లాడే నైతికహక్కు కాంగ్రెస్, బీజేపీకి లేదని చెప్పారు. ఈ పథకంపై హుజూరాబాద్ సభలో సీఎం కేసీఆర్ స్పష్టమైన విధివిధానాలను ప్రకటించారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, మిష న్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు తెచ్చినప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు అవన్నీ సాధ్యమా అని ఇవే పార్టీలు పిచ్చి ప్రేలాపనలకు పోయా యని.. వాటన్నింటినీ విజయవంతం చేసిన మహోన్నతనేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రపంచంలో తొలిసారిగా దళితజాతిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ తెచ్చిన పథకంతో కాంగ్రెస్, బీజేపీలకు కాళ్ల కింద నేల కదిలిపోతున్నదని చెప్పారు. ప్రతి దళితకుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా బాసటగా నిలిచే దళితబంధు పథకాన్ని స్వాగతించాల్సింది పోయి గందరగోళం సృష్టిస్తున్న వారిని ప్రజలే తరిమితరిమి కొడతారని తెలిపారు. ప్రజలంతా చల్లగా ఉండాలని శోభమ్మ ఎప్పుడూ తపిస్తుంటారని.. తల్లి లాంటి ఆమెను రేవంత్రెడ్డి రాజకీయాల్లోకి లాగడం శోచనీయమని మండిపడ్డారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కౌటిల్యుడు, హ్యూమన్ కంప్యూటర్ అని కొనియాడారు. దళితబంధుతో రేవంత్ చిన్నమెదడు పాడైపోయిందన్నారు. హుజూరాబాద్లో ఎవరెన్ని వేషాలు వేసినా ఎగిరేది గులాబీజెండాయేనని పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని ఆయనకు తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు.