హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటనపై సిద్దిపేట జిల్లా టీఎన్జీవో నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్లోని అరణ్య భవన్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి పీఆర్సీ ప్రకటనపై సంతోషంగా ఉన్నారా అంటూ మంత్రి హరీశ్ రావు వారిని అడిగి కనుక్కున్నారు. ఉద్యోగుల పట్ల సీఎం ఔదార్యం ప్రసంశనీయమని సిద్దిపేట టీఎన్జీవో నేతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతని, తమ ప్రభుత్వం ఉద్యోగుల సన్నిహిత ప్రభుత్వమని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రజలకు మంచి సేవలు అందించేలా పని చేయాలని వారికి సూచించారు. మీరు ప్రజల కోసం పని చేయండి. మేం మీ కోసం పని చేస్తామని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో సిద్దిపేట జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గాదరి పరమేశ్వర్, కార్యదర్శి విక్రమ్ రెడ్డి, అసోసియేటెడ్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, ట్రెజరర్ అశ్వక్ హైమత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింహులు, టీఎన్జీవో నేతలు బాలరాజు, రాజశేఖర్ వర్మ, సత్యనారాయణ, లింగం, శ్రీధర్, వెంకటేశం, బిలాల్, రాజశేఖర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.