రమణ్ కథానాయకుడిగా సిరి మూవీస్ బ్యానర్పై కె. శిరీషా రమణారెడ్డి నిర్మిస్తున్నచిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’.
ఎం. రమేష్, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో రెండో సాంగ్ ‘మౌనమే మాట కలిపిన నేస్తమయ్యిందా..’ ను మెగాపవర్ స్టార్ రామ్చరణ్ విడుదల చేశారు. కాసర్లశ్యామ్ రాసిన ఈ పాటను యశస్వి కొండెపూడి ఆలపించారు. సినిమా మంచి విజయం సాధించి ఎంటైర్ యూనిట్కు మంచి పేరు రావాలని రామ్చరణ్ అభినందనలు తెలిపారు.