హైదరాబాద్ : తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్(టీఎన్జీవోస్) యూనియన్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని అధ్యక్షతన వేడుకలను నిర్వహించారు. యూనిట్ అధ్యక్షుడు ఉమర్ఖాన్ ఆధ్వర్యంలో టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ సమక్షంలో 10 చక్రాల కుర్చీలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.మహబూబ్ ఖాన్కు విరాళంగా అందజేశారు.
ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ సెంట్రల్ నాయకురాలు శైలజ, జిల్లా సభ్యులు కె.ఆర్.రాజ్ కుమార్, కుర్రాడి శ్రీనివాస్, ఈ.నరేష్ కుమార్, ఎం.మురళి రాజ్, ఖాలీద్ అహ్మద్, వైదిక్ శాస్త్ర, గీత సింగ్, బి.శంకర్, ఆసుపత్రి నర్సింగ్, పరిపాలన, నాల్గవ తరగతి ఉద్యోగులు, మానసిక ఆసుపత్రి యూనిట్ కార్యదర్శి పి.నాగరాజు, యూనిట్ సభ్యులు, ఆసుపత్రి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.