హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ ఒక్క రోజులోనే పరిష్కరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉద్యోగ బాంధవుడని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కొనియాడింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉద్యోగులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతా సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం భద్రాద్రి నుంచి బాసర వరకు, గద్వాల నుంచి ఆదిలాబాద్ వరకు బస్సుయాత్రలు నిర్వహించాలని తీర్మానించింది. బుధవారం టీఎన్జీవో భవన్లో టీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రికి కార్యవర్గం ఏకగ్రీవంగా ధన్యవాదాలు తెలిపిందని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారి.. సభ సాక్షిగా టీఎన్జీవో ఘన చరిత్రను సీఎం కేసీఆర్ ప్రశంసించడం అపూర్వమని పేర్కొన్నారు. తెలంగాణ అనే పదాన్ని గత ఎనిమిది దశాబ్దాలుగా భుజాల మీద వేసుకొని, ఉద్యోగుల హక్కులతోపాటు తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో ముందుండి పోరాడిన సంఘం టీఎన్జీవో అని సీఎం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమావేశంలో టీఎన్జీవో ఉపాధ్యక్షులు, కస్తూరి వెంకటేశ్వర్లు, శ్యామ్సుందర్, స్వామి, నరసింహాచారి, ఉమాదేవి, సెక్రటరీలు ఎం సత్యనారాయణగౌడ్, నజీర్, ఎంబీ నరేందర్, ఏ రాజేందర్, తిరుమల్రెడ్డి, రాము, లక్ష్మణరావు, రవి, దివ్య, జీ చంద్రశేఖర్, కే రమేశ్, కార్యనిర్వాహక కార్యదర్శి ఈ కొండల్రెడ్డి, ప్రచార కార్యదర్శి జగదీశ్వర్, కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి
అదిరే ఫీచర్లతో షియోమీ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది..!