జమ్మికుంట, ఆగస్టు 3 : తమ ఆత్మగౌరవాన్ని కాపాడి, రాష్ట్రంలో తలెత్తుకు ని తిరిగేలా చేసిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యోగుల మద్దతు ఉంటుందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ స్ప ష్టం చేశారు. సీఎం కేసీఆర్ భోళాశంకరుడని, అడిగిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తారని కొనియాడారు. 30 శాతం పీఆర్సీ, పదవీ విరమణ వయ సు 61 ఏండ్లకు పెంపు, కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేసినందుకు టీఎన్జీవో మార్కెట్ ఉద్యోగుల సెంట్ర ల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహరెడ్డి, ప్రధానకార్యదర్శి ఫసియొద్ద్దీన్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతాభినందన సభ నిర్వహించా రు. ఈ సభకు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజర య్యా రు. ఈ సందర్భంగా రాజేందర్ మా ట్లాడుతూ.. 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన టీఆర్ఎస్ సర్కార్కు కృతజ్ఞతతో ఉంటామని తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభు త్వం దేశంలో తెలంగాణ ఒక్కటేనని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఇస్తుంటే, కేంద్రం ఐటీ రిటర్న్స్ పేరుతో గుంజుకుంటున్నదని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఉద్యోగుల కోసం పాటుపడని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పారు. ఇప్పటి కీ రాష్ట్రంలో ఆంధ్రా అధికారుల పెత్త నం కొనసాగుతున్నదని, వారి భరతం పడతామని హెచ్చరించారు. తమ సం ఘాన్ని కొందరు కౌరవ సేన అంటున్నారని, మాది కౌరవ సేన కాదు.. గౌరవ సేన అని వ్యాఖ్యానించారు. తమను వ్యతిరేకించే వారికి తాము ఎప్పటికీ వ్యతిరేకమేనని, 9.17 లక్షలకుపైగా ఉద్యోగులమంతా రాష్ట్ర ప్రభుత్వం వైపే ఉన్నామని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్, టీఎన్జీవో నాయకులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు రూపుమాపేందుకు కుట్రలు పన్నుతున్నదని, వారిని అంధకారంలో నెట్టేలా చట్టాలను రూపొందిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు సహకారం అందించాలని కోరారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఫిట్మెంట్ ఇచ్చిన నేత సీఎం కేసీఆర్ ఒక్కరేనని కొనియాడారు.