హైదరాబాద్ : తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్ఈఎస్)లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు గురువారం పొడిగింపబడింది. V, VI, VII, VIII, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి 2021-22 విద్యా సంవత్సర ప్రవేశాలకుగాను ఆన్లైన్ దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం వెలువరించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా టీఎంఆర్ఈఎస్ కార్యదర్శి బి. షఫీయుల్లా కోరారు.
దరఖాస్తులను టీఎంఆర్ఈఎస్ మొబైల్ యాప్ ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ http://www.tmreis.telangana.gov.in/ లేదా టీఎంఆర్ జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం టీఎంఆర్ఈఎస్ వెబ్సైట్ లేదా డీఎండబ్ల్యూఓ కార్యాలయం లేదా టీఎంఆర్ కాలేజీలు, స్కూల్స్ లేదా టీఎంఆర్ఈఎస్ ప్రధాన కార్యాలయం, హైదరాబాద్ లేదా 040-23437909 లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.