హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) క్రియాశీలక పాత్ర పోషించిందని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతిసాగర్ అన్నారు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో 2001 మే 31న ఏర్పడిన టీజేఎఫ్ 14 ఏండ్లపాటు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిందని చెప్పారు. సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణ, పాశం యాదగిరి, క్రాంతి కిరణ్ వంటి అనేకమంది జర్నలిస్టులు కలిసి టీజేఎఫ్ ఏర్పాటుచేశారని తెలిపారు. టీజేఎఫ్ ఏర్పడి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సోమవారం గన్పార్లోని అమరవీరుల స్థూపానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్ సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మారుతిసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన తర్వాత టీజేఎఫ్ స్పూర్తితో తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ సంఘంగా ఏర్పాటై జర్నలిస్టుల హకుల సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెమ్జూ అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా జర్నలిస్టులు నాడు ఉద్యమంలో, నేడు పునర్నిర్మాణంలో పాల్గొంటున్నారని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిషరిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. టీజేఎఫ్ వ్యవస్థాపక సభ్యుడు రమణకుమార్ మాట్లాడుతూ ఎకడైనా జర్నలిస్టులు హకుల కోసం ఉద్యమిస్తారని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు జర్నలిస్టులుగా ఉద్యమించాలనే టీజేఎఫ్ స్థాపించామని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నవీన్కుమార్ యార, అమిత్ భట్టు, సుదర్శన్రెడ్డి, కొండా శ్రీను తదితరులు పాల్గొన్నారు.