హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరంలో సిలబస్ తగ్గించబోమని సీబీఎస్సీ స్పష్టం చేసింది. 2021-22 విద్యాసంవత్సరంలో 9వ తరగతి నుంచి 12 వరకు సిలబస్ తగ్గించేదిలేదని వెల్లడించింది. దీంతో గతేడాది తగ్గించిన అంశాలను సీబీఎస్సీ మళ్లీ పునరుద్ధరించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికిగాను 2020-21 విద్యా సంవత్సరంలో 30 శాతం సిలబస్ను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సిలబస్ తగ్గింపు ఒకసారికే పరిమితమని చెప్పినట్లు గుర్తుచేసింది. కాగా, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మే-జూన్ నెలల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పూర్తి సిలబస్ వివరాలు cbse.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..