వర్ధన్నపేట, ఏప్రిల్ 27: కరోనా విపత్తు సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేయూతనిచ్చేందుకు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోందని వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఫిరంగిగడ్డ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలుగకుండా మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం సంతోషంగా ఉందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు, రైతులు విధిగా కరోనా నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ అల్లమనేని మోహన్రావు, పీఏసీఎస్ కార్యదర్శి వెంకన్న, కౌన్సిలర్లు రాజమణి, రవీందర్, సుజాత, ఐనవోలు డైరెక్టర్ దేవేంద్ర, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే లక్ష్యం : ఎంపీపీ
రాయపర్తి: రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని కిష్టాపురంలో ఇందిరాక్రాంతిపథం-మహిళా స్వయం సహాయక సంఘాల నేతృత్వంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సర్పంచ్ సంకినేని ఉప్పలమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ నిర్వాహకులు రైతులకు ప్రయోజనం చేకూరేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఐకేపీ సీసీ పరీదుల అనిత, వాంకుడోత్తండా సర్పంచ్ కునుసోత్ సరిత, ఉప సర్పంచ్లు, రైతు కన్వీనర్లు కునుసోత్ సజ్జన్నాయక్, కత్తి సుజాత, రవీందర్, తోట సోమనర్సయ్య, మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.