Telangana
- Nov 30, 2020 , 17:41:57
VIDEOS
కీర్యతండా శివారులో పులి సంచారం

వరంగల్ రూరల్ : జిల్లాలోని ఖానాపురం మండలం మారుమూల అటవీ ప్రాంతమైన కీర్యతండా శివారు గుట్టల్లో పెద్దపులి సంచరించినట్లు తెలిసింది. నర్సంపేట ఎఫ్ఆర్వో రమేశ్ కథనం ప్రకారం.. తండాకు చెందిన మహిళ దస్లీ ఆదివారం వ్యవసాయ పనుల కోసం శివారు గుట్టల్లోని పొలం వద్దకు వెళ్లగా కొద్ది దూరం నుంచి పెద్దపులి వెళ్తుండడం గమనించింది. భయంతో ఇంటికి వచ్చి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించింది. ఈ మేరకు సోమవారం కీర్యతండా శివారులోని గుట్టలు, పొలాల్లోకి వెళ్లి పరిశీలించగా పెద్దపులి ఆనవాళ్లు కనిపించాయి. ఇక్కడ పెద్దపులి తిరుగుతున్నట్లు సమాచారం ఉంది. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా పులి కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు తెలుపాలని ఎఫ్ఆర్వో కోరారు.
తాజావార్తలు
- సభ్యత్వ నమోదులో టీఆర్ఎస్దే ప్రథమ స్థానం
- ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్.. స్నేహితురాలి తండ్రి పనేనా.!
- విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి
- వైరల్ వీడియో : ఆవు క్యాట్ వాక్
- ఆటోపైనే ఇళ్లు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!
- ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు
- సెంచరీతో సెలక్టర్లను ఆకర్శించిన దేవ్దత్
- దేవ్రీ ఆలయంలో పూజలు చేసిన ధోనీ
- సందీప్ కిషన్ నా ఫోన్ కాల్ ఎత్తాలంటే భయపడ్డాడు
- చిన్నారుల విద్యకు సోనూ సూద్తో చేతులు కలిపిన ఎంఐ మొబైల్స్
MOST READ
TRENDING