ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. జిల్లాలోని బెజ్జూరు మండలం గబ్బాయి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నది. దీంతో స్థానికులను భయాందోళనకు గురవుతున్నారు. పులి దాడిలో ఒక ఆవు మృతి చెందగా.. మరో రెండు ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి.
పులిని చూసిన పశువుల కాపర్లు చెట్టెక్కి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. పెద్దపులి సంచారానికి సంబంధించి స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పులికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. పులి పాద ముద్రల ఆధారంగా గాలిస్తున్నారు. కాగా, పులి సంచరిస్తుండటంతో గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.