తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో గుంట భూమి కూడా ఎండిపోకుండా చూడటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తెలిపారు. మరో రెండ్రోజుల్లో కొండపోచమ్మసాగర్ నుంచి హల్దీవాగులోకి సాగునీరు వస్తుందని చెప్పారు. మెద క్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్ చెక్డ్యాం పరిసరాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఎండిపోయిన చెక్డ్యాం, పంటపొలాలను పరిశీలించారు. సాగుచేసిన పంట లు ఎండిపోకుండా చూడాలని రైతులు వంటేరు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల కోరిక మేరకు ఇటీవల కూడవెల్లి వాగులోకి మల్లన్నసాగర్ నుంచి నీటిని విడుదల చేశారని తెలిపారు. హల్దీవాగులోని కాళేశ్వరం జలాల విడుదలతో సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, వర్గల్, మర్కూ క్, మెదక్ జిల్లాలోని తూప్రాన్, వెల్దుర్తి, నర్సాపూర్ మండలాలతోపాటు సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. హల్దీవాగు పరీవాహక ప్రాంతంలోని చెక్డ్యాంలు పొంగిపొర్లి.. వేల ఎకరాల బీడుభూములు సస్యశ్యామలమవుతాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్, వర్గల్ మండలాల మీదుగా తూప్రాన్ మండలంలోని యావాపూర్, కిష్టాపూర్, బ్రాహ్మణపల్లి, నాగులపల్లి చెక్డ్యాంలు జలకళను సంతరించుకుంటాయన్నారు. ఇక్కడే గ్రామస్తులమం తా పండుగ జరుపుకొందామని ఆయన ప్రకటించడంతో జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ రైతులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, టీఆర్ఎస్ తూప్రాన్ మండలాధ్యక్షుడు బాబుల్రెడ్డి, యావాపూర్ సర్పంచ్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : మంత్రి ఈటల
కర్ఫ్యూ, లాక్డౌన్కు అవకాశం లేదు