కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. నిన్న హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని పేర్కొన్నది.
ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం జగిత్యాల, కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ములుగు, వరంగల్ రూరల్, యాదాద్రిభువనగిరి, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షం కురిసింది.
అత్యధికంగా యాదాద్రిభువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని జలాల్పూర్లో 82.1 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. ములుగు జిల్లా లక్ష్శీదేవిపల్లిలో 69.3 మిల్లీమీటర్లు, వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లో 69 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా మదనాపురంలో 68 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 19 సర్కిళ్లలో 30 చోట్ల తేలికపాటి వర్షం పడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..