గర్మిళ్ల, సెప్టెంబర్ 20: ఏడాదిన్నర బాబును దవాఖానలో చూపించుకొని వస్తున్న ఓ కుటుంబాన్ని పిడుగు బలితీసుకున్నది. ఈ ఘటనలో తల్లీకొడుకు ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన తండ్రి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్లకు చెందిన వెంకటేశ్, మౌనిక దంపతులకు ఏడాదిన్నర కుమారుడు శ్రేయాన్ ఉన్నాడు. వెంకటేశ్ మంచిర్యాల జిల్లా నస్పూర్లో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శ్రేయాన్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో సోమవారం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి నస్పూర్కు బయల్దేరారు. మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జిపై నుంచి వస్తుండగా ఉదయం 11 గంటల ప్రాం తంలో వారిపై పిడుగు పడింది. భార్య మౌనిక (28) అక్కడికక్కడే మృతి చెం దింది. కుమారుడు శ్రేయాన్ దవాఖానకు తరలిస్తుండగా చనిపోయాడు. వెంకటేశ్కు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.