లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మిథాని ఇంటిపై కొందరు దుండగులు సోమవారం అర్ధరాత్రి సమయంలో బాంబులు విసిరేందుకు యత్నించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతా సిబ్బందితోపాటు స్థానికులు గుర్తించి దండగులను వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సురేంద్ర మిథాని గోవింద్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కన్పూర్లోని పండునగర్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు. దాడికి యత్నించిన ముగ్గరు నిందితులు కాన్పూర్కు చెందిన వారేనని పోలీసులు విచారణలో గుర్తించారు. ఘటనాస్థలంలో కొన్ని దేశవాళి బాంబులతోపాటు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పండునగర్ పోలీస్ అవుట్పోస్ట్ ఇన్చార్జి ఆనంద్ ప్రకాశ్ తెలిపారు. వీరు ఎమ్మెల్యే ఇంటిపై ఎందుకు దాడికి యత్నించారనేది తెలియరాలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.