నారాయణపేట : కరోనా నియంత్రణకు మూడంచల వైద్య ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం జిల్లాలోని మక్తల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన 10 పడకల కొవిడ్ సర్వీస్ సెంటరును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నుంచి ప్రజల ఆరోగ్యం కాపాడటానికిలక్ష మూడంచల ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలన్నారు.
కరోన లక్షణాలు ఉండి ఇంట్లో సరిపడా వేరుగా గదులు లేని వారికి సరిపడ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అక్కడే మందులు , ఆహారం ఇస్తూ చికిత్సలు చేయాలని ఎవరికైనా ఆరోగ్యం క్షిణిస్తే అలాంటి వారిని అంబులెన్స్ ద్వారా మక్తల్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ సర్వీస్ సెంటర్లో 10 బెడ్లు ఉండగా అందులో 5 ఆక్సిజన్ బెడ్లు కాగా మిగిలిన 5 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కలిగి ఉన్నాయని తెలిపారు.
బాధితుల వెంట వచ్చే అటెండెంట్లకు సైతం బయట ఉండటానికి వసతి, భోజనం తదితర ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఇంటింటి ఫివర్ సర్వే ఎలా నడుస్తుందని వైద్య అధికారులతో ఆరా తీశారు.
కార్యక్రమంలో మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ వనజమ్మ, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామమోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే యస్. రాజేందర్ రెడ్డి, ఎస్పీ డా. చేతన, అదనపు కలెక్టర్ కె.చంద్రారెడ్డి, డి.సి.సీబీ చైర్మన్ నిజాం పాషా, ఆర్.డి.ఓ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. శైలజ, డీఎస్పీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి