నర్సంపేట, మే 24 : పాలకమండలి సహకాంతో కాకతీయయూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని యూని వర్సిటీ పాలక మండలి సభ్యుడు బత్తిని చంద్ర మౌళి అన్నారు. సోమవా రం హన్మకొండలోని యూ నివర్సిటీ పరిపాలన భవ నంలో వైస్ఛాన్స్లర్ ప్రొఫె సర్ రమేశ్ను ఆయన కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ కొవిడ్ నేపథ్యంలో యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ద్వారా వంద శాతం విద్యాబోధన జరిగేట్లు చూడాలని కోరారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పాలక మండలి సభ్యుల సహకారంతో, ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ అధ్యాపకులతో కలిసి యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని అన్నారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సేవలను వినియోగించడం ద్వారా మరింత ముదుకెళ్తామన్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ పదవికి నియామకం జరగడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.