జయశంకర్ భూపాలపల్లి : కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన వారు ధైర్యంగా ఉండాలి. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సూచించారు. రేగొండ మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. బాధితులతో మాట్లాడి ఆరోగ్య సేవలను అడిగి తెలుసు కున్నారు.
కరోనా బాధితులు హోమ్ ఐసోలేషన్ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండి చికిత్స పొందాలన్నారు. ఎవరు బయట తిరుగొద్దాన్నారు. కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
అలాగే ప్రతి రోజు ఒక్క నిర్దిష్ట సమయాన్ని కేటాయించి ఆ సమయంలోనే కరోనా టెస్ట్ లను నిర్వహించాలి. కరోనా టెస్ట్ లకి దూరంగా వ్యాక్సినేషన్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ఇవి కూడా చదవండి..
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
చెక్ డ్యామ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే