హైదరాబాద్ : జాతీయతా స్ఫూర్తిని చూపించే సమయం ఇది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ.. ప్రియమైన మోదీజీ తమ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అందించేందుకు అనేక రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం దాన్ని పాన్-ఇండియా చేయాలి. జాతీయవాదం స్ఫూర్తిని చూపించే సమయం ఇది అని కవిత పేర్కొన్నారు.
వచ్చే నెల నుండి పెద్దలందరికీ మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరగనుంది. తమ పౌరులకు ఉచితంగా కొవిడ్ వ్యాక్సినేషన్ అందించనున్నట్లు తెలిపిన రాష్ట్రాల జాబితా ఈ విధంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, గోవా, కేరళ, ఛత్తీస్గఢ్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అసోం, సిక్కిం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఒడిశా.