హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్-కోల్కతా మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-హౌరా(కోల్కతా)-సికింద్రాబాద్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు ఈనెల 16 నుంచి మే 2 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈరైలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు సికింద్రబాద్ నుంచి బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 2.40 గంటలకు హౌరాకు చేరుకుంటుంది. హౌరా నుంచి ప్రతిరోజు ఉదయం 11.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 5.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..