బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చాలా రోజుల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్పైకి వస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న పఠాన్ మూవీలో అతడు ఓ సీక్రెట్ ఏజెంట్గా నటిస్తున్నాడు. ఈ మూవీని చాలా వరకు సీక్రెట్గా చిత్రీకరిస్తున్న సినిమా యూనిట్.. చాలా వరకూ విషయాలను బయటకు లీక్ చేయడం లేదు. అయితే ఈ మధ్యే ఈ మూవీలో తానో గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు సల్మాన్ ఖాన్ చెప్పాడు. ఈ మూవీ ఫస్ట్లుక్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తుండగా.. తాజాగా లీకైన ఓ విషయం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
ఈ మూవీ కోసం కింగ్ ఖాన్ ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని చిత్ర వర్గాలు ఇప్పటి వరకూ ధృవీకరించలేదు. అయితే 2018లో జీరో తర్వాత వస్తున్న షారుక్ ఖాన్ మూవీ ఇదే కావడంతో ఈ భారీ రెమ్యునరేషన్ నిజమే కావచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 2022లో పఠాన్ మూవీ రిలీజ్ కానుంది. గతేడాది నవంబర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో ఫిమేల్ లీడ్గా దీపికా పదుకోన్ నటిస్తుండగా, జాన్ అబ్రహం కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు.