గువాహటి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలతో అసోంలో బీజేపీ నేత ఒకరు దారుణహత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి ప్రత్యర్థులు అతడిని కత్తులతో పొడిచి చంపేశారు. తిన్ సుకియా జిల్లాలోని బూహిదిహింగ్ గ్రామపంచాయతీ పరిధిలో ఈ హత్య జరిగింది. హతుడు బీజేపీకి చెందిన బూత్ స్థాయి ప్రెసిడెంట్ అధ్యక్షుడు దేబానంద గగోయ్ అని పోలీసులు వెల్లడించారు.
కాగా, ఈ హత్య ఘటనను అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఖండించారు. ఈ హత్యకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితులకు కఠిన శిక్షపడేలా చేయాలని డీజీపీని ఆదేశించారు. కాగా, ఈ హత్యకు కేసుకు సంబంధించి నిందితుడు జయచంద్ర గగోయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఒక డాగర్ను స్వాధీనం చేసుకున్నారు.