అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో తాజాగా 23,160 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కొవిడ్-19తో 106 మంది చనిపోయారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,736. కరోనా ఇప్పటివరకు ఏపీలో 9,686 మంది మృత్యువాతపడ్డారు.
జిల్లాల వారీగా తాజాగా నమోదైన కొవిడ్ మరణాల వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 17 మంది మృతిచెందగా, నెల్లూరు, విశాఖపట్నంలో 11 మంది చొప్పున, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున, అనంతరపురం, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో 8 మంది చొప్పున, గుంటూరులో ఏడుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, కడపలో ఒక్కరు చొప్పున మరణించారు.