కుమురం భీం : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి వాహనాల్లో డ్రైవర్లు దుర్మరణం చెందారు. రెబ్బన మండలం గోలేటి క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.
లారీలు ఢీకొన్న వేగానికి ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. డ్రైవర్ల మృతదేహాలు క్యాబిన్లలో ఇరుక్కుపోవడంతో అతికష్టం మీద బయటకు తీశారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.