హుజూరాబాద్ టౌన్, మే 23: ముదిరాజ్ బిడ్డను అని చెప్పుకునే ఈటల రాజేందర్.. అదే సామాజికవర్గానికి చెందిన పిట్ల మహేశ్ ముదిరాజ్కు చెందిన భూమిని కబ్జా చేయడం సిగ్గుమాలిన చర్య అని టీఆర్ఎస్వీ రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి మొలుగు పూర్ణచందర్ విమర్శించారు. ఆదివారం హుజూరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తవ్వినకొద్దీ ఈటల భూ కబ్జాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలనే కాదు తన సామాజికవర్గాన్ని కూడా వదలలేదని, భూ కబ్జాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు. వీణవంక మండలం నర్సింగాపూర్లో జరిగిన హత్య, హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన టీఆర్ఎస్వీ నాయకుడు బాషబోయిన ప్రవీణ్యాదవ్ మృతితో ఈటలకు సంబంధం లేదా అని ప్రశ్నించారు. ఈటలకు చీము నెత్తురు ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో టీఆర్ఎస్వీ నాయకులు అరవింద్, శ్రీకాంత్, రాజేందర్, టి ప్రసాద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.